కోరోనా విషాదం.. మ‌రో హాస్యన‌టుడి క‌న్నుమూత‌

-

క‌రోనా మ‌హమ్మారి బంధాలను తెంచేస్తోంది. క‌రోనాతో చాలా మంది ప్ర‌ముఖులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్ప‌టికే సినీ ఇండ‌స్ట్రీలో ప‌లువురిని పొట్ట‌న బెట్టుకున్న వైర‌స్ తాజాగా మ‌రో హాస్య‌న‌టుడిని చంపేసింది. త‌మిళ ఇండ‌స్ట్రీకి చెందిన ఓ ప్ర‌ముఖ హాస్య న‌టుడు క‌రోనాకు బ‌లైపోయారు.

త‌మిళ క‌మెడియ‌న్ పాండు(74)ఈ రోజు క‌రోనాతో చ‌నిపోయారు. ఆయ‌న కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతుండ‌గా.. ఆస్ప‌త్రిలో చేర్పించారు. అయితే టెస్టుల్లో పాజిటివ్ రావ‌డంతో కొవిడ్ ఆస్ప‌త్రిలో చికిత్స అందించారు కుటుంబ స‌భ్యుడు.

కాగా చికిత్స పొందుతూ ఈ రోజు ఉద‌యం ఆయ‌న చ‌నిపోయారు. జై శంక‌ర్‌, ఎజాయిన్ సిరిపిల్‌, ఘిల్లీ లాంటి ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క సినిమాల్లో న‌టించారు. చివ‌ర‌గా క‌ద‌ల్ కొట్టై సినిమాలో యాక్ట్ చేసినా ఆయ‌న‌.. ఇక ఇండ‌స్ట్రీకి సెల‌విచ్చారు. ఆయ‌న‌కు భార్య‌, ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఆయ‌న మృతిప‌ట్ల ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news