దాసరి విగ్రహావిష్కరణకు ముహుర్తం ఖరారు

-

శతాధిక చిత్ర దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణ రావు విగ్రహావిష్కరణ ఏర్పాట్లు జరుగుతున్నాయ్యాయి. ఆయన స్వస్థలం పాలకొల్లులో దాసరి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. దాసరి విగ్రహ నిర్మాణ కమిటి ఆధ్వర్యంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున విగ్రహావిష్కరణ జరుపనున్నారు. దాసరి ప్రియ శిష్యుడు, నటుడు, నిర్మాత డా. మోహన్ బాబు విగ్రహ ఆవిష్కరణ కర్తగా ఉంటున్నారు.

దాసరి స్మ్రుతులతో కోటి ఆధ్వర్యంలో సంగీత విభావరి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణ రావు అభిమానులు, శిష్యులు పాల్గొననున్నారని తెలుస్తుంది. కార్యక్రమంలో భాగంగా సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news