తగ్గేదేలే అంటున్న శ్రీవల్లి.. ‘సీతారామం’లో కీలక పాత్రకు రెట్టింపు పారితోషికం..!?

-

క్యూట్ బ్యూటీ రష్మిక మందన ..‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ఆ చిత్రంలో ‘శ్రీవల్లి’గా రష్మిక మందన నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. అలా నేషనల్ క్రష్ రష్మిక..అందరి ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. ఇక తాజాగా విడుదలైన ‘సీతారామం’లో రష్మిక మందన.. కీలక పాత్ర పోషించింది.

ఓ వైపున స్టార్ హీరోయిన్ గా కెరీర్ లో దూసుకుపోతున్నప్పటికీ కీలక పాత్ర కోసం ఒప్పుకున్నందుకు ‘సీతారామం’ మూవీ యూనిట్ రష్మిక కు థాంక్స్ చెప్పింది. సినిమాను మలుపు తిప్పే ‘ఆఫ్రీన్’ అనే పాత్ర ను రష్మిక పోషించింది. కాగా, ఈ సినిమాకు రష్మిక తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ప్రజెంట్ సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది.

పాన్ ఇండియ మూవీ ‘పుష్ప’ చిత్రానికి రష్మిక మందన రూ.1 కోటి తీసుకుంటున్నట్లు తెలుస్తుండగా, ‘సీతారామం’ పిక్చర్ కు రష్మిక..రెట్టింపు రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఈ ఫిల్మ్ లో నటించినందుకు రష్మిక మందన రూ.3 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలొస్తు్న్నాయి. అయితే, ఇందులో నిజమెంతుందనేది ఇంకా తెలియడం లేదు.

రష్మిక మందన.. ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్స్ లో ఫుల్ బిజీగా ఉంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న రష్మిక..తెలుగులో ‘వారసుడు’ చిత్రంలో నటిస్తున్నది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ‘వారసుడు’లో రష్మిక మందన ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నది. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news