గోపిచంద్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

-

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలతోనే భారీ పాపులారిటీ దక్కించుకొని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. అలాంటి వారి కోసం అభిమానులు ఇప్పటికీ వెతుకుతూనే ఉంటారు. అలాంటి వారిలో నేహా జుల్కా కూడా ఒకరు.. గోపీచంద్ హీరోగా దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన ఒక్కడున్నాడు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు ప్రయోగాత్మక చిత్రంగా కూడా పేరు తెచ్చుకుంది. బాంబే బ్లడ్ గ్రూప్ అనే రేర్ బ్లడ్ గ్రూప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్నా సరే గోపీచంద్ కెరీర్ లో వన్ ఆఫ్ ద సూపర్ హిట్ మూవీ గా పేరు సంపాదించుకుంది.

ఇక ఇందులో హీరోయిన్ గా నేహా జుల్కా నటించారు.. ముంబైలో పుట్టి పెరిగిన ఈమె ఈ సినిమాతోనే తన కెరీర్ను ప్రారంభించింది. అందం, అభినయంతో మొదటి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది. తర్వాత అందాల ఈ భామకు అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ రెండు చిత్రాలతోనే టాలీవుడ్ కి దూరమైంది. తెలుగు ఇటు హిందీ భాషల్లో కలుపుకొని కేవలం మూడు సినిమాల్లో మాత్రమే నటించింది. బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించింది. అయితే ఇప్పుడు ఎక్కడ కనిపించని ఈమె ఏం చేస్తోంది? ఎలా ఉంది? అని తెలుసుకోవడానికి అభిమానులు తెగ వెతుకుతున్నారు.

ఈ క్రమంలోనే ఆమె పలు యాడ్స్, వెబ్ సిరీస్ లలో నటిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అప్పటికి ఇప్పటికీ ఈమెలో కొద్దిగా మార్పు వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మరి ఈమె ఏ భాషలో యాడ్స్ చేస్తోంది.. ఏ భాషలో వెబ్ సిరీస్ చేస్తోంది ..అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news