బాలకృష్ణ పూరి జగన్నాధ్ ల సీక్రెట్ మీటింగ్ ఎందుకో తెలుసా ..?

-

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో చాలా కాలం తర్వాత భారీ సక్సస్ ని అందుకొని ఒక్కసారిగా బౌన్స్ బ్యా అయ్యాడు. గత కొన్ని సంవత్సరాలుగా పూరికి హిట్ అన్నది లేక హీరోలు డేట్స్ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. అందుకు కారణం పూరి ఒకే ధోరణ లో సినిమాలు చేసి ఫ్లాపులని నెత్తిమీద వేసుకోవడమే. దాంతో హీరోల చుట్టూ తిరిగినా ఎవరు పూరి తో సినిమా చేయడానికి ముందుకు రాకపోవడంతో తన కొడుకునే హీరోగా పెట్టి సినిమా తీశాడు. అది కూడా భారీగా నష్టాలను మిగిలిచింది.

 

ఇలాంటి నేపథ్యం లో రాం తో తీసిన ఇస్మార్ట్ మాత్రం పూరి లోని స్టామినినాని మరోసారి నిరూపించింది. ఈ సినిమా ఈ డేరింగ్ డైరెక్టర్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ ఊపుతో విజయ్ దేవరకొండ తో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. అయితే పాన్ ఇండియా సినిమాగా నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా తో పాటు కొడుకుతో నిర్మిస్తున్న రొమాంటిక్ సినిమా మీద ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. దాంతో ఇంట్లో లాకయ్యాడు పూరి జగన్నాధ్.

అయితే ఈ లాక్ డౌన్ నేపథ్యంలో పూరి పూర్తిగా కథలు తయారు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. దర్శక, రచయిత గా ఇండస్ట్రీలో పూరి జగన్నాధ్ స్టామినానే వేరు. ఇక ప్రస్తుతం పూరి జగన్నాధ్ తయారు చేస్తున్న కథల్లో ఒక కథ స్టార్ హీరో కోసమని సమాచారం అందుతోంది. విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్న సినిమా కంప్లీటవగానే ఈ సీనియర్ హీరోతోనే నెక్స్ట్ సినిమా ఉండబోతుందట.

అయితే ఆ కథ బాలకృష్ణ కోసం అని చెపుకుంటున్నారు. ఇంతకముందు బాలయ్య, పూరి కాంబినేషన్ లో పైసా వసూల్ వచ్చిన సంగతి తెలిసిందే. కాని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు బాలయ్య కి పూరి మేకింగ్ స్టైల్ విపరీతంగా నచ్చిందని చెప్పిన సంగతి తెలిసిందే. ఎలాంటి స్టార్ హీరో అయినా సినిమా స్పీడ్ గా కంప్లీట్ చేయడం పూరి స్పెషాలిటి. అందుకే బాలయ్య మరోసారి ఈ జెట్ స్పీడ్ డైరెక్టర్ తో సినిమా చేయాలనుకుంటున్నారట. బోయపాటి శ్రీను తో చేస్తున్న సినిమా అవగానే పూరి తో సినిమా చేయాలనుకుంటున్నారట. అందుకే బాలయ్య .. పూరితో మాట్లాడి మంచి కథ రెడీ చేయమన్నారట. ఈ విషయం గోప్యంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news