త్వరలోనే సెట్స్​పైకి ‘దృశ్యం-3’ మూవీ.. ఒకేసారి రెండు భాషల్లో షూటింగ్​

-

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ హిట్ థ్రిల్లర్.. ప్రేక్షకులను సీటు అంచున నిలబెట్టే ఉత్కంఠ రేపిన సినిమాల గురించి మాట్లాడుకుంటే.. అందులో మొదట ప్రస్తావనకు వచ్చే సినిమా దృశ్యం. మలయాళం డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమా.. మాతృక మలయాళంలోనే కాదు రీమేక్‌ అయిన ప్రతి భాషలోనూ విజయం సాధించింది. మలయాళంలో మోహన్‌లాల్‌ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్‌ సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంతో ‘దృశ్యం-2’ కూడా రూపొందించారు. ఇది కూడా మంచి విజయం సాధించింది.

కరోనా సమయంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇక దృశ్యం-2 కూడా మలయాళం తర్వాత తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఘన విజయం సాధించింది. తాజాగా ‘దృశ్యం-3’ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. హిందీ, మలయాళంలో భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి, ఒకే తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news