డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాకు ర‌కుల్ ఇంటిని వాడుకుందా?

-

దివంగ‌త బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి త‌రువాత బాలీవుడ్‌ని డ్ర‌గ్స్ వివాదం ఓ కుదుపు కుదిపేస్తోంది. రియా కార‌ణంగా ఈ వ్య‌వ‌హారంలో ఇరుక్కున్న ర‌కుల్ ప్రీత్‌సింగ్ శుక్రారం ఎన్సీబీ అధికారుల ముందు హ‌జ‌రైన విష‌యం తెలిసిందే. ఈ విచార‌ణ‌లో ర‌కుల్ ప‌లు కీల‌క విష‌యాల్ని వెల్ల‌డించిన‌ట్టు జాతీయ మీడియాలో ప‌లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

ఈ క‌థ‌నాల ప్ర‌కారం ర‌కుల్ న‌లుగురు సెల‌బ్రిటీల పేర్ల‌ని బ‌య‌ట‌పెట్టింద‌ని, ముంబైలోని ఆమె నివాసం నుంచి ఎన్సీబీ అధికారులు డ్ర‌గ్స్‌ని స్వాధీనం చేసుకున్నార‌ట‌. ఇవి ఎవ‌రివ‌రి, ఎక్క‌డి నుంచి వ‌చ్చాయ‌ని ర‌కుల్‌ని అధికారులు ప్ర‌శ్నిస్తే అవి రియావేన‌ని, డ్ర‌గ్స్ స‌ర‌ఫారా కోసం రియా త‌న ఇంటిని వాడుకుంద‌ని ర‌కుల్ అధికారుల‌కు వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది. ఇక డ్ర‌గ్స్ పెడ్ల‌ర్‌ల‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, తానెప్పుడు డ్ర‌గ్స్ వాడ‌లేద‌ని ర‌కుల్ స్ప‌ష్టం చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news