‘గడ్డి తింటావా’ సాంగ్: ఓటేశారనుకుంటే, వెన్నుపోటేశారంటూ వర్మ సెటైర్…!

-

ప్రస్తుతం అన్ని సినీ పరిశ్రమలలో బిజీగా ఉన్న దర్శకుడు ఎవరంటే కేవలం రాంగోపాల్ వర్మ మాత్రమే. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం అనే రెండు బూతు సినిమాలను ఆర్జివి వరల్డ్ థియేటర్ ద్వారా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఓ వివాదాస్పద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రామ్ గోపాల్ వర్మ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సెటైర్ గా ఓ చిన్న సినిమాను రూపొందిస్తున్నాడు ఆయన. ఇందుకోసం ఏకంగా ఓ టిక్ టాక్ ఆర్టిస్ట్ ను తీసుకువచ్చి సినిమా హీరోగా పరిచయం చేశాడు. ఇక ఈ సినిమాకు పవర్ స్టార్ – ఎన్నికల తర్వాత కథ అని టైటిల్ కూడా నామకరణం చేశాడు. వీటితో పాటు సినిమా లోగో లో జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాస్ ను కూడా ఉంచి జనాల్లోకి వదిలాడు.

pawan kalyan
pawan kalyan

ఇప్పటికే ఈ సినిమా నుండి టైటిల్ పోస్టర్లు, వర్కింగ్ స్టిల్స్ విడుదలయ్యాయి కూడా. ఇది చూసి కొంత వరకు పవన్ అభిమానులు ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే తిట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఇకపోతే నేడు ” గడ్డి తింటావా” అంటూ సాగే పాటను కూడా సెటైరికల్ గానే విడుదల చేశాడు. పవన్ కళ్యాణ్ వాయిస్ మాడ్యులేషన్ లోనే ఈ పాటను అందించారు. సాహిత్యం ఎవరు ఇచ్చారో కానీ చాలా వెటకారంగా అందులో పదాలను జోడించారు. “మనుషులను నమ్మి మోసపోయాను ఓటేశారనుకుంటే, వెన్నుపోటు చేశారు” అనే లైన్ రాసి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ ని చూడడానికి కూడా ఈ ప్రపంచం లో మొట్ట మొదటి సారి సినిమా ట్రైలర్ ను కూడా డబ్బులు పెట్టి చూసే విధంగా చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇందుకోసం రూ. 25 చెల్లించి చూడాలని తెలిపాడు. ఇక ఈ సినిమాను ఈ నెల 25న 11 గంటలకు ఆర్జివి వరల్డ్ థియేటర్ వెబ్సైట్ లో విడుదల చేయబోతున్నారు. ఇక సినిమా చూడాలంటే ఒక టికెట్ ధర రూ. 150.

Read more RELATED
Recommended to you

Latest news