రికార్డ్ స్థాయిలో ఏపీ ఒక్కరోజే 5041 కరోనా కేసులు…!

-

రోజుకి రెండు రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసు లను హెల్త్ బులెటిన్ ద్వారా విడుదల చేసింది. మొత్తంగా 31,148 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 5041 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ఈ సంఖ్యతో నేటితో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,650 కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 647 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో అత్యధికంగా జిల్లాలో మొత్తంగా 6146 కేసులు నమోదయ్యాయి.

cv1
cv1

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 1106 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నడిచిన 24 గంటల్లో ఏకంగా 56 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 642 కు చేరుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26,118 కరోనా యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. నేటి వరకు రాష్ట్రంలో మొత్తంగా 13,15,532 శాంపిల్స్ ను పరీక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news