గరికపాటి వ్యాఖ్యలపై చర్చ అవసరం లేదు – చిరంజీవి

-

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు నిర్వహించిన “అలయ్ బలయ్” వేదికగా చిరంజీవిని ఉద్దేశిస్తూ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. గరికపాటి మాట్లాడుతూ ఫోటో సెషన్ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెళ్ళిపోతా అంటూ చేసిన వ్యాఖ్యలను మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ వివాదంపై తొలిసారిగా చిరంజీవి స్పందించారు.

” ఆయన పెద్దాయన.. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు” అని తెలిపారు. మరి చిరంజీవి స్పందనతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లు అవుతుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే మరోసారి ఆచార్య మూవీ ఫ్లాప్ పై చిరంజీవి స్పందించారు. ఆచార్య ఫెయిల్ అయినందుకు తాను బాధపడడం లేదని అన్నారు. ఆ సినిమాకి తీసుకున్న  80 శాతం పారితోషికాన్ని తాను, రామ్ చరణ్ వెనక్కి ఇచ్చేశామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news