పవిత్రను జాగ్రత్తగా చూసుకోమని ఆయన అన్నారు – వీకే.నరేష్

-

తాజాగా ఎంఎస్ రాజు దర్శకత్వంలో పవిత్ర లోకేష్ , నరేష్ జంటగా నటించిన చిత్రం మళ్ళీ పెళ్లి. ఈ సినిమా విడుదల అయి.. తాజాగా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సినిమా మంచి సక్సెస్ సాధించిన సందర్భంగా తాజాగా చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్న నరేష్ మాట్లాడుతూ.. భారతీయుడిగా అందులోను ఒక తెలుగువాడిగా పుట్టడం నిజంగా గర్వంగా ఉంది అంటూ వెల్లడించారు..

నరేష్ మాట్లాడుతూ.. సినిమా కుటుంబంలో పుట్టి దాదాపు 50 ఏళ్లుగా నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరొకవైపు కృష్ణ గారు కూడా తమ భార్య విజయనిర్మల ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ ను రూపొందించారు. నా వరకు బోల్డెస్ట్ కపుల్స్ అంటే వాళ్ళిద్దరే.. ఈ సినిమాకు వచ్చిన రిజల్ట్ చూసిన తర్వాత వారిద్దరి దీవెనలు మేము అందుకుంటున్నాము అనే నమ్మకం నాకు కలిగింది. గుడ్ కపుల్స్, మంచి ఆర్టిస్టులం అని మేము పేరు తెచ్చుకుంటే చాలు. ఇంతకుమించి ఏం అవసరం లేదు. ఇక రానున్న రోజుల్లో విజయ్ కృష్ణ పతాకం పై మంచి సినిమాలను తెరకెక్కించాలని అనుకుంటున్నాను అంటూ నరేష్ తెలిపాడు.

ఈ సినిమా కోసం మేము కష్టపడి పని చేసాము. ఇకపోతే కోకిల సినిమా సమయం నుంచి శరత్ బాబుతో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ సినిమా కోసం అడగ్గానే శరత్ బాబు , జయసుధ వెంటనే ఒప్పుకున్నారు ఇక ఆయన చివరి రోజుల్లో పవిత్రను జాగ్రత్తగా చూసుకోమని. ఆమె చాలా మంచిది అని.. సంతోషంగా ఉండండి అని శరత్ బాబు నాతో చెప్పారు. కానీ ఈరోజు ఆయనను మిస్ చేసుకోవడం చాలా బాధగా ఉంది అంటూ తెలిపారు నరేష్.

Read more RELATED
Recommended to you

Latest news