నితిన్ కి జాక్ పాట్ .. బాలీవుడ్ లో ఈ కుర్ర హీరో సినిమా ..!

-

తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలకు ఇప్పుడు పర భాషలో మంచి డిమాండ్ ఉంటోంది. మన చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు హిందీలో రీమేక్ చేసి సూపర్ హిట్స్ ని అందుకుంటున్నాడు బాలీవుడ్ మేకర్స్. ఇంతకముందు బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలని మన మేకర్స్ రీమేక్ రైట్స్ కొనుక్కొని ఇక్కడ నిర్మించేవారు. ఆ సినిమాలు ఇక్కడ కూడా మంచి సక్సస్ లను అందుకున్న సంగతి తెలిసందే. ప్రస్తుతం బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్ హిట్ పింక్ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ పేరుతో సిద్దమవుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

 

 

ఇక తెలుగులో రీసెంట్ గా విడుదలై కమర్షియల్ సక్సస్ ని సొంతం చేసుకున్న ‘భీష్మ’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారట. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సొంత బ్యార్ లో నిర్మించిన సంగతి తెలిసిందే. వెంకీ కుడుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా కి విమర్శకుల ప్రశంసలతో పాటు టాలీవుడ్ హీరోలు కూడా మెచ్చుకున్న సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ లో సూర్య దేవర నాగ వంశీ నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది.

ఇక ఈ సినిమాని బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ సినిమాని ‘కబీర్ సింగ్’ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఇప్పడు నాని నటించిన ‘జెర్సీ’ కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ నటించిన ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాలులు కూడా హిందీ రీమేక్ అవుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమా రైట్స్ కూడా కరణ్ జోహార్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి నితిన్ ‘భీష్మ’ కూడా చేరిపోయింది. మరి ఇక్కడ హిట్ అయిన సినిమా బాలీవుడ్ లో సక్సస్ అవుతుందా లేదా చూడాలి. మొత్తానికి భీష్మ రీమేక్ రైట్స్ రూపం లో కూడా నితిన్ జాక్ పాట్ కొట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news