ఎన్.టి.ఆర్ ఇప్పుడైనా నోరు విప్పుతాడా..!

-

నందమూరి కళ్యాణ్ రాం హీరోగా కెవి గుహన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా 118. మరచి 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం జరుగనుంది. ఈ వేడుకకు చీఫ్ గెస్టులుగా నందమూరి నట సింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు అటెండ్ అవుతారని తెలుస్తుంది. కళ్యాణ్ రాం కోసం బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి వస్తున్నారు.

హరికృష్ణ మరణం తర్వాత ఎన్.టి.ఆర్, బాలకృష్ణల మధ్య దూరం పోయింది. అరవింద సమేత ఈవెంట్ కు బాలయ్య గెస్ట్ గా రాగా.. ఎన్.టి.ఆర్ బయోపిక్ ఈవెంట్ కు తారక్ వచ్చి తన పిల్లలకు మా తాత బయోపిక్ మీ తాత తీశాడని గర్వంగా చూపిస్తానని అన్నాడు. తీరా సినిమా రిలీజ్ తర్వాత సైలెంట్ అయ్యాడు. కథానాయకుడే కాదు రీసెంట్ గా రిలీజైన మహానాయకుడు రిలీజ్ అయ్యాక కూడా ఎన్.టి.ఆర్ నోరు విప్పలేదు.

ఈరోజు బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ఒకే వేదికపై కలుస్తారు. మరి ఈరోజైనా బాలయ్య తీసిన ఎన్.టి.ఆర్ బయోపిక్ పై స్పందిస్తాడో లేదో చూడాలి. ఈవెంట్ లో ఎన్.టి.ఆర్ ఏం మాట్లాడతాడు.. బాలకృష్ణ స్పీచ్ ఎలా ఉండబోతుంది అన్న విషయంపై చర్చలు మొదలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news