నితిన్ చేసే రిస్క్ టాలీవుడ్ లో ఇంకెవరూ చేయరేమో …!

-

టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ కి ఒక సపరేట్ ఇమేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. క్లాస్ సినిమాలు చేయగలడు అలాగే మాస్ సినిమాలు చేయగలడు. అంతేకాదు ఎక్స్‌పరిమెంట్స్ ని చేయడానికి ముందుంటాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో రంగ్ దే సినిమాలో నటిస్తున్నాడు. నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.

 

ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలోను ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన అంధాధూన్ రీమేక్‌లోనూ నటించనున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోంది. ఇనాళ్ళు లాక్ డౌన్ కారణంగా నిలిచిన ఈ సినిమాని త్వరలో పట్టాలెక్కించాలని యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

 

అయితే ఇప్పుడు నితిన్ ఈ సినిమా తో పెద్ద రిస్క్ చేయబోతున్నాడని చెప్పుకుంటున్నారు. బాలీవుడ్ లో అంధాధున్ సెన్షేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ సినిమా తో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు ను దక్కించుకున్నాడు. అయితే తెలుగులో ఈ సినిమా దర్శకుడు మేర్లపాక గాంధీ కి, నితిన్ కి సవాల్ గా మారిందని అంటున్నారు.

 

ముఖ్యంగా నటీనటులని ఎంచుకోవడం పెద్ద ఛాలెంజింగ్ గా మారిందట. అంధాధున్ లో కీలకపాత్రలో టబు, హీరోయిన్ గా రాధిక ఆప్టే నటించారు.ఈ రెండు పాత్రలు కాస్త గ్లామర్ ఎక్కువగా ఉన్నవి కావడంతో ఇక్కడ ఆ పాత్రలని ఎవరితో చేపించాలా అన్న డైలమా నెలకొందట. ఇక హీరో పాత్ర గుడ్డివాడిగా, అలాగే కొన్ని హాట్ రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి. దాంతో ఇలాంటి పాత్రలతో రిస్క్ నితిన్ తప్ప మరెవరూ చేయగలరా అంటూ చర్చించుకుంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news