అల్లు అర్జున్ ప్రభాస్ మార్కెట్ ని టార్గెట్ చేశాడా …?

-

తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు కంప్లీట్ సౌత్‌ సినిమా ఇండస్ట్రీ మొత్తం లో ఒక్క ప్రభాస్ కి మాత్రమే పాన్ ఇండియా స్టార్ అన్న రేంజ్ అండ్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇంతకముందు రాజముళి తో ప్రభాస్ ఛత్రపతి సినిమా చేసినప్పటికి ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయి భారీగా వసూళ్ళు సాధించింది. కాని పాన్ ఇండియా స్టార్ అన్న ఇమేజ్ ని ఇవ్వలేదు. కాని బాహుబలి ఫ్రాంఛైజీ తో ప్రభాస్ కి పాన్ ఇండియా స్టార్ అన్న ఇమేజ్ వచ్చింది. చెప్పాలంటే తెలుగు హీరోలకే కాదు సౌత్ లో ఉన్న మిగతా స్టార్ హీరోలకి ఇది బాగా క్రేజ్ గా మారింది. అందుకే తెలుగు హీరోల తో పాటు సౌత్ లో ఉన్న సూర్య, విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ లాంటి వాళ్ళు కూడా ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని తెగ తాపత్రయపడుతున్నారు.

 

ఇప్పుడు అల్లు అర్జున్ ఇదే టార్గెట్ గా పెట్టుకున్నాడని సమాచారం. అల వైకుంఠపురములో సినిమాతో తో భారీ క్రేజ్ సాధించిన అల్లు అర్జున్ ఈ సారి పాన్ ఇండియా స్టార్ అవడానికి ప్లాన్ చేసుకున్నాడట. అందుకే సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాని 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే పాన్ ఇండియా స్టార్ అన్న ఇమేజ్ రావడం అంత సులభమైన విషయం కాదు. అంతేకాదు ఈ ఇమేజ్ ని నిలుపుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఈ విషయం ప్రభాస్ కి సాహో సినిమాతో అర్థమైంది. కాబట్టే తన తర్వాత సినిమా విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మేకర్స్ కి బడ్జెట్ కి మించి ఖర్చు చేయొద్దని నిర్మొహమాటంగా చెప్పారు.

కానీ మన స్టార్ హీరోలు మాత్రం ప్రభాస్ ని ఫాలో అవుతూ పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ని సాధించుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఈ రేస్ లో ప్రస్తుతం ఎన్.టి.ఆర్,
రాం చరణ్ ముందు ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఈ లిస్ట్ లో జాయిన్ అయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా ని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ కి ఉన్న మార్కెట్ ని అల్లు అర్జున్ కూడా సంపాదించుకోవాలని చూస్తున్నాడట. మరి ఈ విషయంలో అల్లు అర్జున్ సక్సస్ అవుతాడా లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news