నాని చేజారిన మరో ప్రాజెక్ట్.. డ్రాపయిందా ..?

-

టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరో నాచురల్ స్టార్ నాని. గత కొంతకాలంగా వరసగా ఫ్లాప్స్ వస్తున్నప్పటికి నాని తో సినిమాలు నిర్మించడానికి మేకర్స్ సిద్దంగా ఉన్నారు. ‘జెర్సీ’ లాంటి హిట్ తర్వాత నాని హీరోగా అదే నిర్మాణ సంస్థలో మరో సినిమాని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘టాక్సీ వాలా’ లాంటి వినూత్నమైన కథని ఆవిష్కరించి హిట్ అందుకున్న దర్శకుడు ‘రాహుల్ సాంకృత్యన్’ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించాలని సన్నాహాలు చేశారు. అంతేకాదు ఈ సినిమాకి ‘శ్యామ్ సింగ రాయ్’ అన్న టైటిల్ ని కన్‌ఫర్ చేశారు.

 

Nani Shyam Singha Roy Based On Reincarnation ? | Espicyfilms.com

ఇక ఈ సినిమాని 2020 డిసెంబర్ 25న రిలీజ్ చేస్తామంటూ కూడా వెల్లడించారు. నాని కెరీర్ లో 27వ సినిమాగా నిర్మించనున్న ఈ సినిమాలో మరోసారి నానికి జంటగా సాయి పల్లవి నటిస్తుందని అన్నారు. ఇక ఈ సినిమా పిరియడిక్ కాన్సెప్ట్ తో రూపొందనుందని వార్తలు వచ్చాయి. దాంతో సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని నిర్మాతలు కూడా హై బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మించాలని అనుకున్నారట. ఒకరకంగా చెప్పాలంటే నాని కెరీర్ లో ఇదే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అని అనుకున్నారు.

కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టినట్టు లేటెస్ట్ న్యూస్. అంతేకాదు లాక్ డౌన్ తరువాత కూడా సినిమాను నిర్మించాలనుకోవడం లేదట. కరోనా కారణంగా ఈ ప్రభావం దాదాపు సంవత్సరం పైనే ఉండబోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాంతో నిర్మాతలు నాని తో పాన్ ఇండియా సినిమాని నిర్మించి రిస్క్ చేయడం ఎందుకు అన్న ఆలోచనకి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ లెక్కన చూస్తే అకౌంట్ నుంచి ఒక ప్రాజెక్ట్ డ్రాపయినట్టే అని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news