డైరెక్టర్ గా మారిన జ‌బ‌ర్ధ‌స్థ్ కిరాక్ ఆర్పీ.. జేడీ చక్ర‌వ‌ర్తితో సినిమా..!

-

‘జ‌బ‌ర్ధ‌స్థ్’, ‘అదిరింది’ కామెడీ షోల‌తో ప్రేక్షకులకి దగ్గరైన క‌మెడియన్ ఆర్పీ ద‌ర్శ‌కునిగా మారారు. శ్రీ ప‌ద్మ‌జ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై కోవూరు అరుణాచ‌లం నిర్మాత‌గా కిరాక్ ఆర్.పి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప్రొడ‌క్ష‌న్ నెం 1 సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఈ ప్రారంభోత్స‌వ వేడుకలకు నాగ‌బాబు ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. కాగా, ఈ సినిమాలో జేడీ చక్ర‌వ‌ర్తి, ప్ర‌కాశ్ రాజ్, రావు ర‌మేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ.. గ‌త కొన్నేళ్లుగా జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షో ద్వారా న‌న్ను ఆద‌రించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కి కృత‌జ్ఞ‌త‌లు.

సస్పెన్స్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంగా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కుద‌ర‌డంతో ద‌ర్శ‌కునిగా ఆడియెన్స్ ముందుకి రావ‌డానికి నిశ్చ‌యించుకున్నాను. ఈ సినిమాలో జే.డి. పాత్ర చాలా విల‌క్ష‌ణంగా ఉంటుంది. జే.డి.చ‌క్ర‌వ‌ర్తితో పాటు, ప్ర‌కాశ్ రాజ్, రావుర‌మేశ్, జ‌బ‌ర్ధ‌స్థ్ ఆదిత్య త‌దిత‌రులు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. అలాగే సాధ్య‌మైనంత త్వ‌ర‌లో హైద‌రాబాద్, నెల్లూర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా ఆర్పీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news