జయసుధ కుమారుడి రిసెప్షన్ వేడుక.. చిరు, పవన్ హాజరు

-

ప్రముఖ నటి జయసుధ కుమారుడు నిహార్ వివాహ వేడుకలు ఢిల్లీలో జరిగాయి. అమృత్ కౌర్‌తో ఫిబ్రవరి 26న జరిగిన ఈ పెళ్లి వేడుకలో కుటుంబీకులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. అయితే సినీ పరిశ్రమ కోసం, తన సన్నిహితుల కోసం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో సినీ పెద్దలందరూ పాల్గొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, నాగార్జున-అమల, నమ్రతా, దిల్ రాజు ఇలా సినీ ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాకుండా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం ఈ వేడుకలో మెరిశాడు. మురళీమోహన్, నరేష్, టీఎస్సార్, కే రాఘవేంద్రరావు, వంటి సీనియర్స్ హాజరయ్యారు.

జయసుధ సమకాలీకులైన కుష్బూ, సుహాసిని వంటి నాటి అందాల తారలు కూడా ఈ ఈవెంట్‌లో మెరిశారు. మొత్తానికి జయసుధ కుమారుడి రిసెప్షన్ వేడుకలు హాట్ టాపిక్‌గా మారాయి. నిహార్ పెళ్లి సంగతేమో గానీ రిసెప్షన్ మాత్రం అందరి నోళ్లలో నానుతోంది. వీటికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news