‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’పై హైకోర్టును ఆశ్రయించిన కేఏ పాల్..

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు`. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిస్తు్న్న ఈ సినిమాతో రాజకీయా వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు వర్మ. అయితే ఈ సినిమాపై మరో కేసు దాఖలైంది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ ను అవమానించేలా చూపించారంటూ క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్, హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని కోరుతూ, పిటిషన్ ను దాఖలు చేశారు.

ఈ కేసులో ప్రతివాదులుగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ, సెన్సార్ బోర్డు, రామ్ గోపాల్ వర్మ, జబర్దస్త్ కమేడియన్ రాము తదితరులను చేర్చారు. కేఏ పాల్ పిటిషన్ పై నేటి మధ్యాహ్నం తరువాత హైకోర్టులో విచారణ జరుగనుందని సమాచారం. కాగా, ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news