కోటిన్నర ఇస్తే ఎవరైనా ఓకే

-

టాలీవుడ్ లో దశాబ్ధం పైగా హీరోయిన్ గా ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ అగర్వాల్ మధ్యలో కెరియర్ కాస్త అటు ఇటుగా మారినట్టు కనిపించినా ఫైనల్ గా మళ్లీ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తూ క్రేజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం అమ్మడి డిమాండ్ భారీ రేంజ్ లో ఉందని తెలుస్తుంది. సీనియర్ హీరోల దగ్గర నుండి యువ హీరోల దాకా కాజల్ కావాల్సి వచ్చిందట.

అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అమ్మడు రెమ్యునరేషన్ పెంచేసింది. ప్రస్తుతం తేజా డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది కాజల్. ఈ సినిమాలో నటించేందుకు గాను అమ్మడు ఏకంగా 1.75 కోట్లు తీసుకుందట. కోటి ఇచ్చేందుకే కష్టం అనుకుంటున్న ఈరోజుల్లో కాజల్ కు కోటిన్నర పైగా అంటే సినిమాలో ఏమంత స్పెషల్ ఉందో తెలియాల్సి ఉంది.

కోటిన్నర పైగా ఎవరు ఇచ్చినా వారితో రొమాన్స్ కు రెడీ అన్నట్టు ఉంది అమ్మడి వాలకం చూస్తుంటే.. కాజల్ ను ఏరి కోరి ఎంచుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ అమ్మడితో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news