బ్రహ్మాస్త్ర నష్టాలతో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న కరణ్ జోహర్.. అసలు నిజాలు బయట పెట్టిన కమల్

-

రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, నాగార్జున తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్రహ్మాస్త్రం సెప్టెంబర్ లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 250 కోట్ల బిజినెస్ను చేసింది అంతేకాకుండా ఈ సినిమా మంచి టిక్ టాక్ సంపాదించుకుందని నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిందని అందరూ అనుకున్నారు.. కానీ దీనిపై తనను తాను మూవీ క్రిటిక్‌గా చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్ ఖాన్ వెర్షన్ మాత్రం మరోలా ఉంది.

బ్రహ్మాస్త్ర సినిమా భారీ నష్టాలను చవిచూసిందని కె ఆర్ కే తన ట్విట్టర్లో షేర్ చేశారు.. ఈ భారీ నష్టాలను ఎదుర్కోలేక నిర్మాత కరణ్ జోహార్ ఆత్మహత్యకు ప్రయత్నించడానికి అందర్నీ షాక్కు గురి చేశాడు..

“బ్రహ్మాస్త్ర భారీ నష్టాలను చవిచూసిందని.. . దీంతో చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు.. తర్వాత ముఖేష్ అంబానీ అతనికి రూ. 300 కోట్లు అప్పుగా ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అంతేకాదు ఇకనైనా తాను దివాళా తీసినట్లుగా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌ ప్రకటించాలి.. ” అంటూ చెప్పుకొచ్చాడు.

కమల్ ట్వీట్ విషయానికొస్తే.. ‘తెలిసిన దాని ప్రకారం, కొన్నిరోజుల కిందట కరణ్ జోహార్ తన ఇంట్లో ‘బ్రహ్మాస్త్ర’ భారీ నష్టాలు తెచ్చిపెట్టిందని ఆత్మహత్య నాటకానికి తెరతీశాడు. అప్పుడు ముఖేష్ అంబానీ తనకు రూ. 300 కోట్లు అప్పుగా ఇచ్చి ఆదుకున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. ‘బ్రహ్మాస్త’మూవీ వల్ల తాను దివాళా తీసినట్లు కరణ్ ప్రపంచానికి ఎందుకు స్పష్టంగా చెప్పలేదు’అని రాసుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news