కాంతారా సినిమా హీరో.. ఎన్టీఆర్ తో సినిమాపై క్లారిటీ ఇదే..!!

-

జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కన్నడ సూపర్ స్టార్ దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ కి అక్కడ ప్రభుత్వం ఇచ్చిన అత్యున్నత పురస్కారం అవార్డు ప్రధాన ఉత్సవం కార్యక్రమంలో ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంతారా సినిమా హీరో అలాగే దర్శకుడైన రిషబ్ శెట్టితో కూడా ఎన్టీఆర్ కొద్ది సమయం మాట్లాడడం జరిగింది. దాంతో మీడియా పెద్ద ఎత్తున వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందంటూ ప్రచారం మొదలుపెట్టేశారు. ఎన్టీఆర్ చేయబోతున్న భారీ పాన్ ఇండియా సినిమాలో.. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించబోతున్నాడు అంటూ వచ్చిన వార్తలు గత కొద్ది రోజులుగా జాతీయస్థాయిలో వైరల్ అవుతూ ఉండడంతో అభిమానుల సైతం వీరి ప్రాజెక్టు కోసం తెగ ఆత్రుతగా చూశారు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు హీరో కం డైరెక్టర్ రిషబ్ శెట్టి.

రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో సినిమా అంటూ వస్తున్న వార్తలపై స్పష్టత లేదు.. ఎన్టీఆర్ అంటే నాకు చాలా అభిమానం.. ఒక అద్భుతమైన నటుడుగా ఎన్టీఆర్ ను గౌరవిస్తాను. అతనితో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నాను.. కానీ ప్రస్తుతానికి ఎవరూ కూడా ఆ విషయంపై సంప్రదించలేదు.. అలాగే ఎవరూ కూడా ఇప్పటివరకు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు అంటూ రిషబ్ శెట్టి క్లారిటీ ఇచ్చారు.ఇకపోతే రిషబ్ శెట్టి తాజాగా స్వీయదర్శకత్వం లో తెరకెక్కించిన కాంతారా సినిమా కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన రూ. 350 కోట్ల రూపాయలను రాబట్టింది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఏ విధంగా లాభాలను అందించిందో అర్థం చేసుకోవచ్చు.

ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news