అక్షయ్ కుమార్ ని చీపురుతో కొట్టిన కత్రీనా కైఫ్…!

-

బాలివుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్… నటించిన చిత్రం సూర్య వంశీ. ఈ సినిమా షూటింగ్ చాన్నాళ్ళ క్రితమే పూర్తి అయిన సంగతి తెలిసిందే. అయితే అక్షయ్ కుమార్ మాత్రం ఈ సినిమా షూటింగ్ ని మిస్ అవుతున్నాడు అంటుంది బాలివుడ్  . అతను ఈ సినిమా షూటింగ్ ని బాగా ఎంజాయ్ చేసాడుని అంటుంది. తాజాగా బయటకు వచ్చిన ఒక వీడియో అదే విషయాన్ని చెప్తుంది.

ఇటీవల, అక్షయ్, కత్రినా కైఫ్ కి సంబంధించిన తెరవెనుక వీడియోను పంచుకున్నారు, అక్కడ హీరోయిన్ చీపురుతో నేల తుడుచుకుంటుంది. “మీరు ఏమి చేస్తున్నారు?” అని అక్షయ్ వీడియోలో కత్రినాను అడుగుతాడు. ఆమె “సాఫ్-సఫాయి” అని సమాధానం చెప్పింది. అప్పుడు ఆమె చీపురు తీసుకొని దానితో అక్షయ్ ని కొట్టడం వీడియోలో హైలెట్ గా నిలిచింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అక్షయ్ కత్రినాను ‘సరికొత్త స్వచ్ఛ భారత్ రాయబారి’ అని కూడా పిలిచారు. సూర్యవంశీ సెట్లలో సరికొత్త # స్వచ్ భారత్ బ్రాండ్ అంబాసిడర్” అని అక్షయ్ కుమార్ ఈ వీడియోను పంచుకున్నారు. 2011 లో సింగం సినిమాతో కెరీర్ ప్రారంభించిన దర్శకుడు రోహిత్ శెట్టి చేస్తున్న నాలుగో చిత్రం ఇది. కత్రినా మరియు అక్షయ్ కాకుండా, జాకీ ష్రాఫ్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. సూర్యవంశీలో అజయ్ దేవ్‌గన్, రణ్‌వీర్ సింగ్ అతిధి పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం మార్చి 27 న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news