IAS అంటే ఇలా ఉండాలి .. తోపులకే తోపు గురూ నువ్వు !

-

అమరావతి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలో నిరసనలు చేస్తున్న రైతులపై అక్రమంగా కేసులు పెడుతూ వస్తున్నారు ఏపీ పోలీసులు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడితే కఠినంగా వారిని శిక్షించడానికి ప్రతి అవకాశం కోసం ఎదురు చూస్తూ పరిపాలన చేస్తున్నారు జగన్.

Image result for ias"

ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే పలు విద్యార్థులను అమరావతి ప్రాంతానికి చెందిన వాళ్లను మరియు అదే విధంగా అదే ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలను అరెస్టు చేస్తూ వస్తున్న జగన్ సర్కార్ తాజాగా ఓ దళిత ఐఎఎస్‌ అధికారిని అడ్డం పెట్టుకుని చంద్రబాబుని జైల్లో పెట్టించాలని చేసిన ప్రయత్నాలు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యాయి. దానికి కారణం సదరు ఐఎఎస్‌ అధికారి. మేటర్ లోకి వెళ్తే  మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం నియమించిన కమిటీ రిపోర్ట్ పట్ల చంద్రబాబు ఆ కమిటీలో ఉన్న దళిత ఐఏఎస్ అధికారి నీ విమర్శించడం జరిగింది.

 

ఆయన ఏమైనా పై నుంచి దిగి వచ్చారా..? అని ప్రశ్నించారు. దీంతో వైసీపీ పార్టీకి చెందిన నేతలు సదరు దళిత ఐఏఎస్ అధికారిపై పై చంద్రబాబు దుర్భాషలు మాట్లాడారని ఆరోపించడం జరిగింది. దీంతో చంద్రబాబు పై కేసు పెట్టాలి అని వైసిపి నేతలంతా దళిత ఐఎఎస్‌ అధికారి పై ఒత్తిడి తీసుకురాగా. నా కులాన్ని అడ్డం పెట్టుకుని దయచేసి రాజకీయాలు చేయకండి అంటూ దళిత ఐఎఎస్‌ అధికారి రిప్లై ఇచ్చారట. సిఎంఒ అధికారులు కూడా ప్రయత్నించిన దళిత ఐఏఎస్ అధికారి ససేమిరా అన్నారట. అంతేకాకుండా సిఎంఒ కార్యాలయం వైపు కూడా వెళ్లడం మానేశారట. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో అది IAS అంటే ఇలా ఉండాలి .. తోపులకే తోపు గురూ నువ్వు అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన పై పొగడ్తల వర్షం కురిపించారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news