Keerthy Suresh : మెలిమి బంగారంలా మెరిసిపోతున్న కీర్తి

-

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ ల‌లో కీర్తి సురేశ్ ముందు వ‌రుస‌లో ఉంటుంది. సీనియ‌ర్ హీరోయిన్ మేనక కూతురుగా సినిమా ఇండ‌స్ట్రీకి అడుగు పెట్టిన కీర్తి సురేశ్.. రోజు రోజుకు త‌న క్రేజ్ ను పెంచుకుంటుంది. అంతే కాకుండా ప్ర‌స్తుతం త‌న కంటు సొంత గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్, కోలీవుడ్ వంటి ఇండ‌స్ట్రీల‌లో అగ్ర హీరోయిన్ గా ఎదిగింది.

అలాగే ప్ర‌స్తుతం కాలంలో హీరోయిన్ల‌ల‌లో అత్య‌ధిక రెమ్యూన‌రేషన్ తీసుకుంటుంది. అంతే కాకుండా.. మొట్ట మొద‌టి సారిగా హీరోయిన్ల రెమ్యూన‌రేషన్ రూ. కోటి వ‌ర‌కు పెంచింది కీర్తి సురేశ్ యే. కాగ కీర్తి సురేశ్.. ప్ర‌స్తుతం అగ్ర హీరోల‌తో సినిమాలు చేస్తు బిజీ బిజీ గా ఉంటుంది.

త‌న అందంతో పాటు అభిన‌యంతో ప్రేక్షకుల‌ను ఆకుట్టుకునే తత్వం కీర్తి సురేశ్ సొంతం. కాగ తాజా గా కీర్తి సురేశ్.. ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆకు ప‌చ్చ చీర‌లో బంగారం ధ‌రించిన మెలిమి బంగారంలా కీర్తి సురేశ్ క‌నిపిస్తుంది.

తెలుగుద‌నం ఉట్టిప‌డేలా.. క‌ట్టు బొట్టుతో అందంగా క‌నిపిస్తుంది. కొప్పులో గులాభి పువ్వూలు పెట్టుకుని సంప్రదాయం కొట్ట‌చ్చిన‌ట్టు కీర్తి సురేశ్ క‌నిపిస్తుంది. కాగ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news