కీర్తి సురేష్ మనసు బంగారం..విలువ 130 గోల్డ్ కాయిన్స్..!

-

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొన్నటి వరకు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గ్లామర్ పాత్రలతో కూడా తన అందాలను బయట ప్రదర్శిస్తూ పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల ద్వారా కూడా కీర్తి సురేష్ తన నటనతో అందరిని మెప్పించింది.. ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీ మినహా అన్ని భాషలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈమె ప్రస్తుతం తెలుగులో నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించబోతోంది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే తాజాగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోవడంతో చిత్ర బృందానికి కీర్తి సురేష్ సర్ప్రైజ్ ఇచ్చారు. సింగరేణి బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ డి గ్లామరస్ పాత్రలో సందడి చేయనున్నారు. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. చివరి రోజు షూటింగ్లో భాగంగా ఈ చిత్రానికి పనిచేసినటువంటి 130 మంది సినీ కార్మికులకు ఒక్కొక్కరికి రెండు గ్రాముల బంగారపు కాయిన్స్ కానుకగా ఇచ్చి అందరికీ సప్రైజ్ చేశారు.

అంతేకాదు అందరికీ ఈ గోల్డ్ కాయిన్స్ ఇవ్వడానికి కీర్తి సురేష్ కి సుమారుగా రూ.13 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇదివరకే పందెంకోడి 2 సినిమా యూనిట్ సభ్యులకు కూడా బంగారపు కాయిన్స్ ఇవ్వడం విశేషం.మరోవైపు చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో కూడా చిరంజీవికి చెల్లి పాత్రలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news