ప్రభాస్ ను మెచ్చుకున్న కేరళ మంత్రి..!

-

ఏదైనా విప్పతు జరిగినప్పుడు మన పర బేధాలు లేకుండా మన స్టార్స్ అంతా తమ వంతు సాయం చేస్తుంటారు. రీసెంట్ గా కేరళ వరదలతో అల్లకల్లోలం సృష్టించగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ప్రజలకు చేయూతగా సిఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు పంపిస్తున్నారు. వీరిలో స్టార్స్ కూడా ఉండటం విశేషం.

తెలుగు పరిశ్రమ నుండి చాలా పెద్ద మొత్తమే విరాళంగా వెళ్లింది. వారిలో ప్రభాస్ ఒక్కడే ఏకంగా కోటి రూపాయలు కేరళ వరద బాధుతుల సహాయార్ధంగా సిఎం రిలీఫ్ ఫండ్ కు పంపించారట. సౌత్ లో ఇంత పెద్ద మొత్తం ఇచ్చిన ఏకైక స్టార్ ప్రభాస్. ప్రభాస్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 70 లక్షలు విరాళంగా ఇచ్చాడట. ఇక మిగతా స్టార్స్ అంతా 25 లక్షల చొప్పున ప్రకటించారు.

అయితే ప్రభాస్ కోటి రూపాయలు ఇవ్వడం గురించి ప్రస్థావిస్తూ మళయాళ స్టార్స్ మీద ఫైర్ అయ్యాడు కేరళ మంత్రి సుందరీశన్. మళయాల స్టార్స్ అంతా తాము తిరిగేందుకు కోట్ల విలువ కార్లు కావాలి కాని విరాళాలు మాత్రం ప్రకటించరని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో వారంగా ప్రభాస్ ను చూసి నేర్చుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news