మల్టీస్టారర్ ట్రెండ్ షురూ.. కొరటాల శివ దర్శకత్వంలో హీరోలుగా బన్నీ, ధనుష్.!

-

మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ నయా ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అయిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లను కలిపి జక్కన్న చిత్రం చేశాడు. ఇది రికార్డు వసూళ్లు చేస్తూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే మరో మల్టీ స్టారర్ కు అడుగులు పడుతున్నట్లు వార్తలు బలంగా వినబడుతున్నాయి.

రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొరటాల శివ ఉన్నారు. ఈయన చేసింది ఐదు సినిమాలు కాగా, అందులో నాలుగు విడుదలయ్యాయి. నాలుగూ సక్సెస్ అయ్యాయి. ఐదో చిత్రం మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’. కాగా, వచ్చే నెలలో అది కూడా విడుదల కానుంది. ఇకపోతే ఇప్పటికే తన నెక్స్ట్ ఫిల్మ్ జూనియర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా లెవల్ లో ఉంటుందని అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు కొరటాల శివ. కాగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ తర్వాత సినిమా మల్టీ స్టారర్ అని వినికిడి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నట్లు గతంలో ప్రకటన వచ్చింది. కానీ, అది ఫైనల్ కాలేదు. ఈ క్రమంలోనే ‘పుష్ప 2’ తర్వాత తాను ఒక మంచి కథతో వస్తానని కొరటాల శివ తెలిపారు. కాగా, అది మల్టీస్టారర్ ఫిల్మ్ అయితే బాగుంటుందని కొరటాల భావిస్తున్నట్లు టాక్. ఇందులో మరో హీరోగా కోలీవుడ్ హీరో ధనుష్ ను తీసుకోవాలని భావిస్తున్నారట.

వీరిరువురిని హీరోలుగా పెట్టడం వలన స్టోరికి అడ్వాంటేజ్ అవుతుందని, అందులో ఫిట్ అవుతారని అనుకుంటున్నారట. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. ధనుష్ ప్రజెంట్ టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చిత్రం చేస్తున్నాడు. చూడాలి మరి.. కొరటాల శివ నిజంగానే ధనుష్, బన్నీలతో మల్టీస్టారర్ చేస్తారో లేదో..

 

Read more RELATED
Recommended to you

Latest news