నటుడు కృష్ణంరాజు ప్రస్థానం..ఆయన చివరి సినిమా ఎందంటే !

-

టాలీవుడ్ లో మరో విషాదం…చోటు చేసుకుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇవాళ మరణించారు. హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు కృష్ణంరాజు. అయితే.. తెలుగు చిత్రసీమలో కృష్ణంరాజు సెల్ఫ్‌ మేకింగ్ పర్శన్‌. సినిమా నేపథ్యం లేకుండా చిత్రసీమలోకి వ్యక్తిగా అడుగుపెట్టి పెద్ద వ్యవస్థను స్థాపించారు. ఐదు దశాబ్దాల నట జీవితంతో పాటు పార్లమెంట్ సభ్యునిగా, కేంద్రమంత్రిగా దేశానికి సేవ చేశారు. 1940 జనవరి 20న మొగల్తూరులో జన్మించారు కృష్ణం రాజు.

తండ్రి ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు, తల్లి లక్ష్మీదేవి. కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి చిన వెంకట కృష్ణంరాజు. నర్సాపూర్ టైలర్ హైస్కూల్‌, వై.ఎన్.ఆర్‌. కాలేజీలో విద్యను అభ్యసించిన కృష్ణంరాజు..హైదరాబాద్‌ బద్రుకా కాలేజీ ఆఫ్‌ కామర్స్ నుండి బీకాం పట్టా పొందారు. కాలేజీ రోజుల్లో అక్కినేని అభిమానిగా ఉన్న కృష్ణంరాజు .. సి.హెచ్‌.వి.పి. మూర్తి రాజు ‘ఆంధ్రరత్న’లో పార్ట్ టైమ్‌ జర్నలిస్టుగా పనిచేశారు. యుక్తవయసులో హైదరాబాద్‌ అబిడ్స్ బర్మన్ బిల్డింగ్ లో రాయల్ స్టూడియో ప్రారంభించిన కృష్ణంరాజు…’వీరాభిమన్యు’లోనూ ఛాన్స్ మిస్ చేసుకున్నారు.

1966లో ‘చిలకా గోరింక’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన కృష్ణంరాజు.. ఆత్మ ఆర్ట్స్ బ్యానర్ లో ప్రత్యగాత్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిలకా గోరింక’ లో నటించారు. 2014 ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డుకు ఎంపికయ్యారు. కృష్ణంరాజు త‌మ్ముడు ప్ర‌ముఖ నిర్మాత యు.సూర్య‌నారాయ‌ణ రాజు. కృష్ణంరాజు త‌మ్ముని కొడుకు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. 1999లోన‌ర‌సాపురం లోక్ స‌భ నుంచి ఎన్నికైన కృష్ణంరాజు.. కేంద్ర‌మంత్రిగానూ ప‌నిచేశారు. కాంగ్రెస్, బీజేపీ,ప్రజారాజ్యం పార్టీల‌లో ఉన్న కృష్ణంరాజు… ప్ర‌స్తుతం బీజేపీలో కొన‌సాగుతున్నారు. కృష్ణంరాజు చివ‌రి చిత్రం `రాధే శ్యామ్`. ఈ సినిమా అట్టర్‌ ఫ్లాఫ్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news