సీఎం చంద్ర‌బాబు టార్గెట్‌గా.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రెండో సాంగ్ రిలీజ్‌..!

-

ల‌క్ష్మీస్ ఎన్‌టీఆర్ నుంచి మ‌రో పాట‌ను వ‌ర్మ విడుద‌ల చేశారు. ల‌క్ష్మీ పార్వ‌తి ఎన్‌టీఆర్‌కు తోడుగా నిలిచిన తీరును కూడా అందులో చూపించారు. ఈ క్ర‌మంలో అందులో చంద్ర‌బాబుకు చెందిన రియ‌ల్ ఫొటోల‌ను వాడుకోవ‌డం విశేషం.

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన తాజా చిత్రం.. ‘ల‌క్ష్మీస్ ఎన్‌టీఆర్‌’. త్వ‌ర‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా.. ఈ సినిమాకు చెందిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్‌తో ద‌ర్శ‌కుడు వ‌ర్మ అభిమానుల్లో భారీగా అంచ‌నాల‌ను పెంచేశారు. ఈ క్ర‌మంలోనే ల‌క్ష్మీస్ ఎన్‌టీఆర్ నుంచి మ‌రో పాట‌ను వ‌ర్మ విడుద‌ల చేశారు. సినిమాలోని ‘అవ‌స‌రం’ అనే పాట‌కు చెందిన లిరిక‌ల్ వీడియో సాంగ్ వీడియోను వ‌ర్మ ఇవాళ విడుద‌ల చేశారు. అందులో విల్స‌న్ హెరాల్డ్ పాటను ఆల‌పించ‌గా, దానికి సిరి శ్రీ సాహిత్యాన్ని అందించారు. క‌ల్యాణి మాలిక్ సంగీతంలో పాట రూపుదిద్దుకుంది.

రెండు నిమిషాల వ్య‌వ‌ధి ఉన్న అవ‌స‌రం పాట‌లో ఎన్‌టీఆర్ కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను ఏ విధంగా అవ‌స‌రం తీరే వ‌ర‌కు వాడుకుని చివ‌రికి ఆయ‌ను ఎలా వ‌దిలేశారో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. అలాగే ల‌క్ష్మీ పార్వ‌తి ఎన్‌టీఆర్‌కు తోడుగా నిలిచిన తీరును కూడా అందులో చూపించారు. ఈ క్ర‌మంలో అందులో చంద్ర‌బాబుకు చెందిన రియ‌ల్ ఫొటోల‌ను వాడుకోవ‌డం విశేషం.

కాగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు చెందిన రెండో ట్రైల‌ర్‌ను మార్చి 8వ తేదీన అంటే రేపు రాత్రి 7.20 గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్నామ‌ని కూడా వ‌ర్మ ప్ర‌క‌టించారు. రామ్‌గోపాల్ వ‌ర్మ‌, అగ‌స్థ్య మంజు ల సంయుక్త ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు రాకేష్ రెడ్డి, దీప్తి బాల‌గిరిలు నిర్మాతలుగా ఉన్నారు. ఇక ఈ సినిమా ఈ నెల 15వ తేదీన విడుద‌లయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది..!

Read more RELATED
Recommended to you

Latest news