బ్రేకింగ్ : ఎన్సీబీ ముందుకు టాలీవుడ్ నిర్మాత‌?

-

బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వివాదం ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. సుశాంత్ మృతి త‌రువాత రియాకు డ్ర‌గ్స్ పెడ్ల‌ర్‌ల‌తో సంబంధాలున్యాయ‌ని తేల‌డంతో ఆ వైపుగా నార్కోటిక్స్ డ్ర‌గ్ కంట్రోల్ బోర్డ్ విచార‌ణ చేప‌ట్టింది. ఈ విచార‌ణ‌లో క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు, పేర్లు బ‌య‌టికి వ‌స్తున్న‌ట్టు జాతీయ మీడియా సంచ‌ల‌న క‌థ‌నాల్ని ప్ర‌సారం చేస్తోంది. రియా విచార‌ణ‌లో 25 మంది సెల‌బ్రిటీల పేర్ల‌ని బ‌య‌ట‌పెట్టింద‌ని అందులో ర‌కుల్‌, శ్ర‌ద్ధా క‌పూర్‌, సారా అలీఖాన్‌, దీపికా పదుకునే ల పేర్లు బ‌య‌టికి వ‌చ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో అంద‌రి దృష్టి బాలీవుడ్ వైపు మ‌ళ్లింది. తాజాగా ఈ కేసు విష‌య‌మై టాలీవుడ్, బాలీవుడ్‌లో క్రేజీ చిత్రాల్ని నిర్మించిన మ‌ధు మంతెన పేరు బ‌య‌టికి వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. తాజాగా ఆయ‌న‌కు ఎన్సీబీ అధికారులు స‌మ‌న్లు జారీ చేశార‌ని, ఆయ‌న ఈ రోజు(బుధ‌వారం) ఎన్సీబీ ముందు హాజ‌రు కానున్నార‌ని జాతీయ మీడియా క‌థ‌నం. మ‌ధు మంతెన సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు కజిన్‌. ఆయ‌న రూపొందించిన `ర‌క్త‌చ‌రిత్ర‌`కు ఓ నిర్మాత‌గా వ్యవ‌హ‌రించారు కూడా. తెలుగు, త‌మిళ‌, హిందీ, బెంగాలీ, మ‌రాఠీ భాష‌ల్లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని అందించారు. ఫాంట‌మ్ ఫిలింస్‌ని అనురాగ్ క‌శ్య‌ప్‌, వికాస్ బెహ‌ల్‌, విక్ర‌మాదిత్య‌తో క‌లిసి ఏర్పాటు చేసి స‌క్సెస్ ఫుల్ మూవీస్‌ని అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news