BB4 హౌస్ ‌లో రచ్చ రచ్చ… దివి కిడ్నాప్, సోహైల్ విశ్వరూపం…!

-

రెండు వారాలు ముగించుకొని మూడో వారంలో కొనసాగుతున్న బిగ్ బాస్ 4 రియాలిటీ షో రోజురోజుకు ఇంట్రెస్ట్ గా ముందుకు సాగుతోంది. తాజాగా ఇచ్చిన రోబో టాస్క్ ఇంట్లోని సభ్యుల మధ్య సెగలు రేపుతోంది. ఇంట్లోని సభ్యులను రెండు గ్రూపులుగా విభజించిన బిగ్ బాస్, ఒక జట్టు సభ్యులను మనుషులుగా… మరొక జట్టుని రోబోలుగా విభజించాడు. ఈ టాస్క్ లో భాగంగా రోబోలు అన్నిటిని చంపేస్తే మనుషులు గెలిచినట్లుగా టాస్క్ ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఉండే సిల్వర్ బాల్స్ ను పగలగొడితే ఒక్కో రోబో చనిపోతుంది. ఇలా అన్ని రోబోలను చంపితేనే మనుషుల టీం గెలుస్తుంది. లేకపోతే ఒక్క రోబో మిగిలి ఉన్నా కూడా రోబో టీం గెలిచినట్టు. ఇక ఈ టాస్క్ లో భాగంగా గత రాత్రి ఓ సిల్వర్ బాల్ ను పగలకొట్టడం ద్వారా రోబో జట్టులో ఉన్న దేవి నాగవల్లి చనిపోయినట్లు అయ్యింది. అయితే అరియనా కు కూడా ఛార్జింగ్ అయిపోతున్న సమయంలో ఆమె బయటికి వెళ్లి అవతలి జట్టు సభ్యులతో పోరాడేందుకు సిద్ధపడింది. ఇక నేడు ఈ గేమ్ సంబంధించి ఏం జరుగుతుందో అన్న ఈ విషయంపై స్టార్ మా తాజాగా ప్రోమో విడుదల చేసింది.

ఇక ఈ ప్రోమోలో చివరకు రోబోలు ఏమి చేయలేని పరిస్థితుల్లో మనుషుల టీంలో ఉన్న ఒకరిని కిడ్నాప్ చేసి బలవంతంగా ఛార్జింగ్ పెట్టుకోవాలని ప్లాన్ వేస్తారు. ఇందులో భాగంగానే ఇంటి డోర్ వద్దకు వచ్చిన దివిని రోబోలు కిడ్నాప్ చేస్తారు. ఈ దృశ్యాన్ని చూసిన మనుషుల టీం సభ్యులు అవతలి టీం సభ్యుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. కేవలం ఆట కోసం అమ్మాయిని ఇంత హింసిస్తారా అంటూ ఫుల్ ఫైర్ అవుతారా..? తూ.. అంటూ సోహైల్ ఉమ్మేశాడు. అంతే కాదు కుమార్ సాయి పై తిట్లతో సోహైల్ విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రోమో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన నెటిజెన్స్ వారి అభిప్రాయాలను విభిన్న స్టైల్స్ లో కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news