Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ అప్‌డేట్..డబ్బింగ్ కంప్లీట్ చేసిన ప్రముఖ నటుడు

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘సర్కారు వారి పాట’. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్ర అప్ డేట్స్ కోసం మహేశ్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తు్న్నారు. అప్ డేట్స్ ఇవ్వడం లేదని ఇటీవల మహేశ్ – కృష్ణ ఫ్యాన్స్ వరస్ట్ టీమ్ ఎస్ వీ పీ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు.

మైత్రి మూవీ మేకర్స్ ‘సర్కారు వారి పాట’ పిక్చర్ అప్ డేట్స్ వెంటనే ఇవ్వాలని అభిమానులు కోరారు. కాగా, ఈ చిత్ర అప్ డేట్ ఇవ్వాల్సిన టైంలోనే ఇవ్వాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్ వచ్చేసింది.

ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని ‘సర్కారు వారి పాట’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఆయన తన డబ్బింగ్ పార్టీ పూర్తి చేసినట్లు తాజాగా పేర్కొన్నారు. దాంతో ఇక మూవీ షూట్ కంప్లీట్ అయినట్లేనని అభిమానులు పేర్కొంటున్నారు. వచ్చే నెల మొదటి వారంలో పిక్చర్ ట్రైలర్ ఉండబోతున్నదని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

సూపర్ స్టార్ తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘సరిలేరు నీకెవ్వరు’ పిక్చర్ లో కనిపించారు. ఈ నేపథ్యంలోనే మహేశ్ అభిమానులు ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ ఈ పిక్చర్ కు మ్యూజిక్ అందించగా, ఆర్.మది సినిమాటోగ్రాఫర్. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాయి. ఈ మూవీలో మహేశ్ కు జోడీగా అందాల ముద్దుగుమ్మ ‘మహానటి’ కీర్తి సురేశ్ నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news