మ‌హేష్ నెక్ట్స్ సినిమా కథ విషయంలో పూర్తి కాని కసరత్తు.. ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో..?

-

ఈ ఏడాది సంక్రాంతికి `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్నారు మ‌హేష్‌. మహేష్ బాబు, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు రికార్డ్స్ సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ చిత్రం రిలీజ్ త‌రువాత మూడు నెల‌ల విశ్రాంతి తీసుకుని ఆ త‌రువాత కొత్త చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేసుకున్నారు. `స‌రిలేరు.. త‌రువాత మ‌హేష్, వంశీ పైడిప‌ల్లితో ఓ భారీ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. మహేష్ హీరోగా మహర్షి లాంటి బ్లాక్‌ బస్టర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి, ఈ సారి సూపర్‌ స్టార్‌ను ఓ యాక్షన్‌ హీరోలా చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అందుకు తగ్గట్టుగా స్పై తరహా కథాంశంతో మహేష్ బాబును జేమ్స్‌ బాండ్‌లా చూపించేందుకు రెడీ అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు పూర్తి చేసేలోగా, వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన హడావిడి ఎక్కడా కనిపించడం లేదు. అందుకు కారణం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఆలస్యం కానుందనేది తాజా సమాచారం. వంశీ పైడిపల్లి సిద్ధం చేసిన స్క్రిప్ట్ లో మహేశ్ బాబు మార్పులు .. చేర్పులు చెప్పాడట. వాటిపై కసరత్తును చేసి, పెర్ఫెక్ట్ గా సిద్ధం చేయడానికి వంశీ పైడిపల్లికి చాలా సమయమే పడుతుందని అంటున్నారు. అందువలన ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి చాలా సమయమే పడుతుందట. మరి మహేశ్ అప్పటివరకూ వేచి చూస్తాడా? లేదంటే వేరే దర్శకుడిని లైన్లో పెడతాడా? అన్న‌ది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news