మహేష్ డైరెక్ట‌ర్స్ ని కన్ ఫ్యూజ్ చేస్తున్నాడు..

-

మహేష్ తన ప్రతిష్టాత్మక 25వ చిత్రం మ‌హర్షి రిలీజ్ కి రెడీగా ఉంది. నెక్ట్స్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫుల్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. అనంతరం ఆయన జాబితాలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాదాపు న‌లుగురు డైరెక్ట‌ర్స్ క్యూ క‌ట్టారు. ఓ వైపు రాజమౌళితో డిస్కషన్ చేస్తున్నాడు. మ‌రోవైపు త్రివిక్ర‌మ్‌తో ఓసినిమాకి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. దీంతోపాటు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కూడా ఓ క‌థ చెప్పిన‌ట్టు ఇటీవ‌ల మ‌హేష్ వెల్ల‌డించార‌ట‌. వీరితోపాటు గీత గోవిందం ఫేమ్ ప‌రుశురామ్ సైతం ఓ న‌యా స్టోరీ నెరేట్ చేసిన‌ట్టు గ‌త కొంత కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి.
Mahesh Babu Confused With Star Directors
దీనికితోడు గీతా ఆర్ట్స్ లో మ‌హేష్ ఓ ప్రాజెక్ట్ చేసే క‌మిట్ మెంట్ ఉంద‌ట‌. ప‌రుశురామ్ సినిమా గీతా ఆర్ట్స్ లో ఉండే అవ‌కాశం క‌నిపిస్తుంది. మ‌రి న‌లుగురు ద‌ర్శ‌కుల్లో అనిల్ రావిపూడి త‌ర్వాతి సినిమా ఎవ‌రితో ఉంటుంద‌నేది స‌స్పెన్స్ గా మారింది. వాళ్ళంద‌రికి బౌండెండ్ స్ర్కిప్టు రెడీ చేయ‌మ‌న్నాడ‌ట‌. రాజ‌మౌళి ప్రాజెక్ట్ చేయాలంటే దాదాపు రెండేండ్లు ప‌డుతుంది. ఎందుకంటే ప్ర‌స్తుతం రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్‌లో బిజీగా ఉన్నారు. ఇది వ‌చ్చేఏడాది జులై 30న విడుద‌ల కానుంది.
ఆ త‌ర్వాత స్క్రిప్ట్ పై వ‌ర్క్ చేయ‌డానికి మ‌రో ఆర్నేళ్ళ‌యినా ప‌డుతుంది. ఇక త్ర‌విక్ర‌మ్ ప్ర‌స్తుతం బ‌న్నీ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేస్తున్నారు. అనంత‌రం చిరంజీవితో ఓ కమిట్‌మెంట్ ఉంది. అది కంప్లీట్ కావాల‌న్నా మ‌రో రెండేండ్లు ప‌డుతుంది. ఇక సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు హిందీలో అర్జున్‌రెడ్డి రీమేక్ క‌బీర్‌సింగ్ కి  ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. ఆ త‌ర్వాత  ఇంకా మ‌రే సినిమా  సెట్ కాలేదు. ఇక ప‌రుశురామ్ ప్ర‌స్తుతం మ‌హేష్  కోసం డై అండ్ నైట్ క‌ష్ట‌ప‌డి స్క్రిప్ట్ చేసే  ప‌నిలో నిమ‌గ్నమ‌య్యాడ‌ట‌. మ‌రి ఈ న‌లుగురిలో మ‌హేష్ ఎవ‌రి సినిమా ఎప్పుడు చేస్తాడ‌నే క‌న్‌ఫ్యూజ‌న్ అటు డైరెక్ట‌ర్స్ లో ఇటు ఆడియెన్స్ లో నెల‌కొంది.

Read more RELATED
Recommended to you

Latest news