క్రిష్ నెక్ట్స్ అక్కీతో..ఈ సారి గ‌ట్టిగా కొడ‌తాడా?

-

హిందీలో సినిమాలు చేసి స‌త్తా చాటిన తెలుగు ద‌ర్శ‌కులు చాలా మందే ఉన్నారు. దాస‌రి నారాయ‌ణ‌రావు, కోడి రామ‌కృష్ణ‌, కె. రాఘ‌వేంద్ర‌రావు, రీసెంట్‌గా పూరీ జ‌గ‌న్నాథ్ వంటి చాలా మంది ప్ర‌ముఖులు అక్క‌డ త‌మ ప‌వ‌ర్ చూపించారు. కె.రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాష్ కోవెల‌మూడి ప్ర‌స్తుతం కంగ‌నా ర‌నౌత్‌, రాజ్‌కుమార్ రావ్ జంట‌గా మెంట‌ల్ హై క్యా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక మ‌రో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్ సైతం బాలీవుడ్‌లో నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గ‌తంలో ఆయ‌న అక్ష‌య్ కుమార్ హీరోగా గ‌బ్బ‌ర్ ఈజ్ బ్యాక్ చిత్రాన్ని రూపొందించారు. తెలుగులో వ‌చ్చిన ఠాగూర్‌, త‌మిళంలో వ‌చ్చిన ర‌మ‌ణ‌కిది రీమేక్‌. ఇది భారీ స‌క్సెస్ ని అందుకోలేక‌పోయిన‌ప్ప‌టికీ, మంచి క‌లెక్ష‌న్ల‌తో ఫ‌ర్వాలేద‌నిపించుకుంది. దీంతోపాటు ఇటీవ‌ల‌ కంగ‌నా ర‌నౌత్ మెయిన్ లీడ్‌గా ఝాన్సీ రాణి ల‌క్ష్మిబాయి లైఫ్ హిస్ట‌రీని బేస్ చేసుకుని మ‌ణిక‌ర్ణిక సినిమాని రూపొందించారు.
Krish Jagarlamudi Next movie With akshay kumar
అయితే తెలుగులో ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆఫ‌ర్ రావ‌డంతో ఆ ప్రాజెక్ట్ నుంచి మ‌ధ్య‌లోనే క్రిష్‌ త‌ప్పుకున్నారు.  దీంతో ఆ సినిమాని కంగ‌నా పూర్తి చేశారు. డైరెక్ష‌న్ విష‌యంలో ప‌లు వివాదాలు ఎదుర్కొన్న‌ప్ప‌టికీ ఆ సినిమా మంచి విజ‌యాన్నే సాధించింది.కానీ క్రిష్ డైరెక్ట‌ర్ గా పూర్తి స్థాయిలో నిరూపించుకోలేక‌పోయారు. ఇప్పుడు మ‌రోసారి బాలీవుడ్‌లో తానేంటో ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నార‌ట‌. అక్ష‌య్ కుమార్ తో మ‌రోసారి సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇటీవ‌లే అక్కీకి ఓ స్టోరీని నెరేట్ చేశార‌ట‌. ఆయ‌న కూడా త‌న ఇంట్రెస్ట్ ని వెల్ల‌డించిన‌ట్టు టాక్‌.
అన్నీ సెట్ అయితే త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ వ‌స్తుంద‌ని ఫిల్మ్ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే ఈ సారి గ‌ట్టిగానే కొట్టాల‌ని క్రిష్ ట్రై చేస్తున్నార‌ట‌. అక్షయ్‌  ప్రస్తుతం మిషన్‌ మంగళ్‌, హౌస్‌ఫుల్‌ 4, గుడ్‌న్యూస్‌, లక్ష్మీబాంబ్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘కాంచన’కు హిందీ రీమేక్‌గా ‘లక్ష్మీబాంబ్‌’ తెరకెక్కుతోంది. ఇక బాల‌కృష్ణ హీరోగా క్రిష్ రూపొందించిన‌ ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు పార్ట్ లు భారీ డిజాస్ట‌ర్స్ గా నిలిచిన విష‌యం విదిత‌మే. ఆ త‌ర్వాత ఆయ‌న మ‌రే సినిమాకి సైన్ చేయ‌లేదు.

Read more RELATED
Recommended to you

Latest news