ఘనంగా ప్రారంభమైన మహేష్ బాబు – నమ్రతల రెస్టారెంట్..!

-

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిజినెస్ చేస్తూ మరింతగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుండి ఎంతోమంది హీరోలు వ్యాపారాలలో రాణిస్తున్నారు. ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందంజలో ఉన్నాడు. మహేష్ బాబు ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఏషియన్ సినిమాస్ వారితో కలిసి హైదరాబాదులో ఏ ఎం బి థియేటర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఏఎంబి థియేటర్ బెస్ట్ థియేటర్స్ లో ఒకటిగా దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు – నమ్రత దంపతులు ఏషియన్ వారితోనే మరో క్రేజీ బిజినెస్ లోకి అడుగుపెట్టారు.

ప్రస్తుతం ఈ ఏషియన్స్ సంస్థతో కలిసి మహేష్ బాబు నమ్రతలు కొత్తగా రెస్టారెంట్ బిజినెస్ లో చేతులు కలిపారు. తాజాగా ఈ రెస్టారెంట్ కు సంబంధించి ఏషియన్స్ వారు పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. ముఖ్యంగా ఈ రెస్టారెంట్ ని ఏషియన్స్ వారితోపాటు నమ్రతా పేరు కలసి వచ్చేలా పెట్టడం విశేషం.. ఏఎన్ రెస్టారెంట్ గా పేరుపెట్టిన ఈ రెస్టారెంట్ ని మునుముందు మరింత అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ని డెవలప్ చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.. అయితే ఏ ఎన్ అంటే ఏ అంటే ఏషియన్స్ , ఎన్ అంటే నమ్రత అనే పేరు వచ్చే విధంగా ఏ ఎన్ అనే పేరు పెట్టినట్లు సమాచారం. అయితే తాజాగా మహేష్ బాబు ఫ్యామిలీలో సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మరణించడంతో మహేష్ బాబు దంపతులు ఈ రెస్టారెంట్ పూజా కార్యక్రమాలలో పాల్గొనలేకపోయారు.

అయితే ప్రస్తుతం మినర్వా కాఫీ షాప్ , ప్యాలెస్ హైట్స్ గా రెండు రెస్టారెంట్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఒకటి డిసెంబర్ 1న మొదలుపెట్టి .. మరో రెస్టారెంట్ ను డిసెంబర్ చివర్లో ప్రారంభించనున్నారు. మొత్తానికైతే మరో బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి తమ ఖాతాలో మరింత డబ్బు జమ చేసుకోబోతున్నారు మహేష్ బాబు – నమ్రతా దంపతులు.

Read more RELATED
Recommended to you

Latest news