పేపర్ బాయ్ గురించి మహేష్ ట్వీట్..!

-

చిన్న సినిమాలకు ఈమధ్య స్టార్స్ ప్రోత్సాహం పెద్ద ఎత్తున ప్రతి ఫలాన్ని అందిస్తుంది. రీసెంట్ గా సినిమా టీజర్, ట్రైలర్ నచ్చితే అది ఎవరిది ఏంటి అని కూడా చూడకుండా దాని మీద ఓ ట్వీట్ చేస్తున్నాడు మహేష్. విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమా అలానే మహేష్ ట్వీట్ తో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఆగష్టు 31న రిలీజ్ అవనున్న పేపర్ బాయ్ మీద మహేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

సంతోష్ శోభన్ హీరోగా జయశంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా పేపర్ బాయ్. సంపత్ నంది నిర్మించిన ఈ సినిమాకు కథ కూడా ఆయనే అందించాడు. ఇక ఈ సినిమా గురించి మహేష్ ట్వీట్ చేశాడు. సినిమా ట్రైలర్ ఈమధ్యనే చూసిన మహేష్ ట్రైలర్ చూసినంత సేపు చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉందని అన్నారు. అంతేకాదు సంతోష్ శోభన్ తండ్రి శోభన్ తో తను ఓ సినిమా చేశాను కాబట్టి అది నా హృదయాన్ని తాకిందని అంటూ మహేష్ ట్వీట్ చేశారు. మరి మహేష్ ట్వీట్ చేశాడంటే ఇక ఆ సినిమా రేంజ్ మారినట్టే.

ప్రస్తుతం వచ్చే వారం రానున్న సినిమాల్లో పేపర్ బాయ్ మీద మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక థియేటర్ కు వచ్చే ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తే చాలు ఇక సినిమా హిట్ కొట్టినట్టే.

Read more RELATED
Recommended to you

Exit mobile version