రామ్ చరణ్ ‘ఆచార్య’కు నయాపైసా పెట్టడం లేదు! .. స్పందించిన నిర్మాణ సంస్థ

-

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. అయితే టైటిల్ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఓ పిట్టకథ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న చిరు నోరు జారడం వల్ల అందరికీ తెలిసిపోయింది. అయితే ఈ మూవీపై రోజుకో వార్త వైరల్ అవుతూ ఉంటుంది.

ఆచార్యలో మహేష్ బాబు నటిస్తాడని కొన్ని రోజులు వార్తలు వచ్చాయి. ఆచార్య నుంచి త్రిష తప్పుకోవడంతో అనుష్క, కాజల్ అంటూ వార్తలు రావడం ఇలా ప్రతీ విషయంలో ఏదో ఒక రూమర్ క్రియేట్ అవుతూనే ఉంది. తాజాగా రామ్ చరణ్‌పైనా ఓ వదంతిని పుట్టించారు. ఈ మూవీకి రామ్ చరణ్ నయా పైసా పెట్టడం లేదని, పేరుకే నిర్మాతా ఉన్నాడని, కానీ లాభాల్లో మాత్రం వాటా తీసుకుంటాడని రూమర్స్ వచ్చాయి.

రామ్ చరణ్‌పై వచ్చిన వార్తలపై మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డి స్పందించారు. ఆచార్యలో ఇద్దరి భాగస్వామ్యం సరి సమానంగా ఉందని, ఎలాంటి విబేధాలు లేవని క్లారిటీ ఇచ్చారు. కరోనా వల్ల షూటింగ్‌ను వాయిదా వేశామని, చిత్రంపై రెండు నిర్మాణ సంస్థలు సమానమైన బాధ్యతతోనే వ్యవహరిస్తున్నామని ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news