తన పెళ్లి ఎప్పుడో చెప్పేసిన శ్రీ ముఖి..

-

యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్నది శ్రీముఖి అయితే ఈమె సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే అలాగే యాంకర్ ఏ న్యూస్ అయినా అంతే పాపులర్ అవుతూ వస్తుంది అయితే తాజాగా ఈమెకు పెళ్లి కుదిరిందని ఓ వ్యాపార వేత్తతో త్వరలోనే పెళ్లి జరగనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించింది శ్రీముఖి..

‘పటాస్’ కామెడీ షో తో మొదలు ఇప్పటికీ వరకు బ్యాక్ టు బ్యాక్ షోలతో అలరిస్తూ వస్తోంది యాంకర్ శ్రీ ముఖి. ప్రస్తుతం మూడు, నాలుగు షోలు ఉన్నాయి. ‘డాన్స్ ఐకాన్’,‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’,‘మిస్టర్ అండ్ మిసెస్’,‘సారంగ దరియా’కు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. నటిగానూ సినిమా అవకాశాలు అందుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లో ముఖ్య పాత్రలో నటిస్తోంది.. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.. అలాగే తాజాగా తన పర్సనల్ లైఫ్ కోసం వచ్చిన రూమర్లపై సోషల్ మీడియా వేదికగా తెలిపేసింది తన పెళ్లి ఎప్పుడో కూడా చెప్పేసింది..

ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి జరగబోతుందని రూమర్లు పుట్టుకొచ్చాయి. గతంలోనూ ఇలాంటి వార్తలను కొట్టి పారేసింది శ్రీముఖి.. ఇక తాజా రూమర్లపైనా ఘాటుగా స్పందించింది.
‘ఒకసారి బాయ్ ఫ్రెండ్ ఎవరంటూ.. మరోసారి పెళ్లి ఎప్పుడంటారు… ఇక తాజాగా మా నాన్న ఫొటోనే బ్లర్ చేసి పెళ్లి రూమర్లను పుట్టించడం దారుణమని మండిపడింది. ఈ వార్తలు వినివిని విసుగొస్తుంది. ఇక పెళ్లి విషయానికొస్తే మూడు, నాలుగేండ్ల తర్వాతే ఉంటుంది. అప్పుడు నేనే స్వయంగా ప్రకటిస్తాను’ అంటూ క్లారిటీ ఇచ్చింది..

Read more RELATED
Recommended to you

Latest news