నాగ చైతన్య మేర్లపాక గాంధి మూవీ

-

అక్కినేని వారసులు సినిమాలైతే చేస్తున్నారు కాని అందుకు తగిన ఫలితాలను మాత్రం అందుకోవట్లేదు. అఖిల్ చేసిన రెండు సినిమాలు నిరాశ పరచగా మూడవ ప్రయత్నంగా ఓ క్రేజీ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఇదిలాఉంటే నాగ చైతన్య మాత్రం హిట్టు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నడు. ఈ ఇయర్ వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందించలేదు.

అందుకే తన తర్వాత ప్రాజెక్ట్ పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాగ చైతన్య. తెలుస్తున్న సమాచారం ప్రకారం నాగ చైతన్య మేర్లపాక గాంధి డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్ గా నిత్యా మీనన్ ను సెలెక్ట్ చేశారట. వి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఈ సినిమాతో పాటుగా నాగ చైతన్య బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ ను కలిసి తన కోసం ఓ కథ సిద్ధం చేయమని చెప్పినట్టు టాక్. కుదిరితే అతని డైరక్షన్ లోనే చైతు సినిమా చేసేందుకు రెడీ అన్నాడట. ఎలాగు విజయేంద్ర ప్రసాద్ కూడా డైరక్టర్ గా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. మరి ఇద్దరు కలిసి ఎలాంటి ప్రయోగం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news