మహేష్ బాబు అక్క మంజుల ని దారుణంగా మోసం చేసిన నమ్రత శిరోద్కర్.. బయటపడిన షాకింగ్ నిజం

-

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్..అప్పట్లో ఈ జంట ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్నవారికి మరియు మీడియా కి తెలియకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షం లో పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..అప్పట్లో ఈ సంఘటన పెద్ద సెన్సేషన్..భీ.గోపాల్ దర్శకత్వం లో 2000 వ సంవత్సరం లో వంశి అనే సినిమా వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా లో హీరోయిన్ గా నమ్రత శిరోద్కర్ నటించింది..బాక్స్ ఆఫీస్ పరంగా పెద్ద ఫెయిల్యూర్ గా ఈ సినిమా నిలిచినప్పటికీ కూడా మహేష్ బాబు – నమ్రత లను మాత్రం ఒకటి చేసింది..ఈ సినిమా షూటింగ్ ఫారిన్ షెడ్యూల్స్ జరుగుతున్నప్పుడే మహేష్ – నమ్రత ప్రేమలో పడ్డారు..ఆ తర్వాత పెద్ద హై డ్రామా తోనే 2005 వ సంవత్సరం లో వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు..పెళ్ళైన తర్వాత నమ్రత శిరోద్కర్ సినిమాలకు గుడ్బై చెప్పేసింది..నమ్రతా ని పెళ్లి చేసుకున్న తర్వాత మహేష్ బాబు కి బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి.

అప్పటి వరుకు కేవలం స్టార్ హీరో గా మాత్రమే కొనసాగిన మహేష్ బాబు..పెళ్లి తర్వాత అతడు , పోకిరి వంటి హిట్స్ తగిలి సూపర్ స్టార్ గా ఎదిగిపోయాడు..అయితే వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం ని పెళ్లి జరిగే వరుకు కొంతమంది కుటుంబ సబ్యులకు కూడా చెప్పలేదు..మహేష్ బాబు చిన్నప్పటి నుండి తన అక్క గారైన మంజుల తో మంచి స్నేహంతో ఉండేవాడు..వాళ్లిదరు అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యినప్పటికీ కూడా మహేష్ తన ప్రేమ గురించి చెప్పలేదట..అంతే కాదు..మంజుల గారికి అంతకుముందు నుండే నమ్రత శిరోద్కర్ మంచి స్నేహితురాలట..కానీ మహేష్ తో తన రిలేషన్ షిప్ గురించి తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుందట నమ్రత శిరోద్కర్..అలా వాళ్లిద్దరూ వాళ్ళ ప్రేమ విషయం నాకు తెలియకుండా మోసం చేసారంటూ మంజుల గారు ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది..ఈమె మహేష్ బాబు తో నాని మరియు పోకిరి వంటి సినిమాలు నిర్మించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ రెండు సినిమాల ఫలితాలు ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇది ఇలా ఉండగా గత కొంత కాలం నుండి నమ్రత శిరోద్కర్ గారు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు జోరుగా ప్రచారమైన సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని నమ్రత శిరోద్కర్ మీడియా కి తెలిపింది..’కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు మరియు వ్యాపారాలు చూసుకోవడం లోనే తనకి సమయం అంతా సరిపోతుంది..అలాంటి సమయం లో సినిమాలు చెయ్యాలనే ఆలోచన కూడా నాకు రాలేదు..చేసే ఆసక్తి కూడా నాకు లేదు..కానీ త్వరలోనే ఒక టీవీ షో ని నా ప్రొడక్షన్ హౌస్ లో నిర్మించబోతున్న..దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది నమ్రత శిరోద్కర్.

Read more RELATED
Recommended to you

Latest news