నందమూరి ఫ్యామిలీకి ఇదేం శాపం..!

-

నందమూరి హీరోలకు రోడ్డు ప్రమాదాలు శాపంగా మారాయా అంటే అవునని అనాల్సిందే. 2009లో ఎన్.టి.ఆర్ నల్గొండ జిల్లా మోతె వద్ద రోడ్ యాక్సిడెంట్ కు గురయ్యాడు అయితే తారక్ ఎలాగో ఆ యాక్సిడెంట్ నుండి కోలుకున్నాడు. అయితే అది మర్చిపోతున్న నందమూరి ఫ్యామిలీకి 2014 లో హరికృష్ణ పెద్ద కొడుకు జానకి రాం అదే రోడ్ యాక్సిడెంట్ లో మరణించాడు.

అది కూడా నల్గొండ హైవే మీద జరగడం గమనార్హం. ఇక ఇప్పుడు హరికృష్ణ కూడా నల్గొండ జిల్లా కేంద్రంలోనే రోడ్డు యాక్సిడెంట్ కు గురయ్యి కన్నుమూశారు. ఈ ప్రతీ ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణం కాగా, ప్రతీసారి నందమూరి వారసులే వాహనం నడిపారు. ఇవన్నీ కూడా నల్గొండ జిల్లాలోనే జరగడం అందర్నీ షాక్‌కి గురి చేస్తున్నాయి. తండ్రి మరణ వార్త విని షాక్ అయిన ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం కొద్దిసేపటి క్రితమే నార్కెట్ పల్లి కామినేని హాస్పిటల్ కు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news