ముద్ర వేసేందుకు వస్తున్న నిఖిల్..!

-

యువ హీరోల్లో నిఖిల్ కెరియర్ కొత్తలో రొటీన్ సినిమాలు చేసినా స్వామిరారా నుండి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. రీసెంట్ గా కిరాక్ పార్టీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ ప్రస్తుతం ముద్ర సినిమా చేస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన కణితన్ సినిమా రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. మాత్రుక దర్శకుడు సంతోష్ ఈ సినిమాను తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తుండటం విశేషం.

నిఖిల్ ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. సినిమా సినిమాకు కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న నిఖిల్ ఈ సినిమాతో ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి. ఈ సినిమా నవంబర్ 8న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కమెడియన్ సత్య కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తుంది.

మరి కణితన్ రీమేక్ గా వస్తున్న ఈ ముద్ర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. నిఖిల్ మాత్రం ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందో లేదో సినిమా చూస్తేనే కాని చెప్పలేం.

Read more RELATED
Recommended to you

Latest news