‘నిశ్శబ్దం’ నుంచి ఫస్ట్‌ సింగిల్ సాంగ్ ప్రోమో వ‌చ్చేసింది..

-

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి అనుష్క. మ‌రియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హోదాను ఆస్వాదిస్తోన్న అనుష్క ప్రధాన పాత్రలో న‌ంచిన చిత్రం ‘నిశ్శబ్దం’. అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రలో కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగించుకొని విడుదలకు సిద్ధమవుతుంది. విభిన్నమైన కథా కథనాలతో ఈ సినిమా నిర్మితమైంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ సాంగ్ ప్రోమోను వదిలారు. “నిన్నే నిన్నే కనులలో నింపుకున్నా .. నిన్నే నిన్నే మనసులో ఒంపుకున్నా” అంటూ ఈ సాంగ్ సాగుతోంది. అనుష్క – మాధవన్ పై చిత్రీకరించిన ఈ పాట ఆహ్లాదకరంగా అనిపిస్తోంది.

గోపీసుందర్ బాణీ .. భాస్కర భట్ల సాహిత్యం .. సిద్ శ్రీరామ్ ఆలాపన మనసుకు పట్టేలా వున్నాయి. అంజలి .. షాలినీ పాండే ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. అనుష్క కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఇది కూడా ఒకటిగా చేరిపోతుందనే అభిప్రాయాలు ఫిల్మ్ నగర్లో వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news