అసెంబ్లీ వేదికగా చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్..

-

టీడీపీ అధినేత చంద్రబాబుకు అసెంబ్లీ వేదికగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్‌ చేశారు. ఉపాధి నిధుల విడుదల కోసం ముడుపులు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. వివ‌రాల్లోకి వెళ్లే.. కేంద్రం నుంచి 1845 కోట్ల రూపాయల ఉపాధి నిధులు వచ్చాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల్లో భాగంగా వేల కిలోమీటర్లు రోడ్లు వేశామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూలి వేతనాలను చెల్లించామన్నారు. ఉపాధి హామీకి బిల్లులు చెల్లించాలని కేంద్రాని మూడు సార్లు అడిగినా ఇవ్వలేదన్నారు.

నీరు-చెట్లు నిధులను టీడీపీ దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. ‘నేను ముడుపులు తీసుకున్నానని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు. నిరూపిస్తే రాజీనామా చేస్తా‘నని తెలిపారు. మేం నిధులను డైవర్ట్‌ చేశామని కేంద్రానికి టీడీపీ లేఖలు రాసిందన్నారు. రాష్ట్రానికి నిధులు రాకూడదని టీడీపీ ఉద్దేశమా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news