అలా చేస్తూ నెటిజన్స్ కి షాక్ ఇచ్చిన నిత్యా మీనన్.. వీడియో వైరల్..!

-

నిత్య మీనన్.. ప్రముఖ మలయాళీ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె తెలుగు , తమిళ్ , మలయాళం భాషా ఇండస్ట్రీలలో కూడా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. నిత్యామీనన్ కేవలం నటించింది 50 సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకోవడం గమనార్హం. ఈమె అన్నీ కూడా సెలెక్టివ్ పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నిత్యామీనన్.. తన నటనకు గాను ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు రెండు నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇకపోతే తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న నిత్యమీనన్ .. కొన్ని సంవత్సరాలు పాటు అవకాశాలు లేక దూరం అయింది . ఆ తర్వాత గీత గోవిందం సినిమాలో చిన్న పాత్ర పోషించిన ఈమె ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ కి భార్య పాత్రలో నటించి ఇరగదీసిందని చెప్పవచ్చు.అంతేకాదు తన నటనకు అవార్డు ఇచ్చినా తక్కువే అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఈ సినిమాతో నిత్యమీనన్ కు ఈ సినిమా బాగా కలిసి వచ్చింది . ఇక ఒక వైపు సినిమాలలో చేస్తూనే మరొకవైపు మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ప్రస్తుతం పలు సింగింగ్ కాంపిటీషన్లకు జడ్జ్ గా వ్యవహరిస్తూ తనదైన శైలిలో న్యాయ నిర్ణేత గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇదిలా ఉండగా తాజాగా నిత్యమీనన్ కు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. నిత్యామీనన్ ఆ వీడియోలో ఒక చేపల కొట్టు దగ్గర నిలబడి చేపల అమ్మే వారితో మాట్లాడుతూనే .. ఇంకొక వైపు ఏదో తింటూ మాట్లాడడం మనం చూడవచ్చు. అంతేకాదు ఈమె ఒక సినిమా షూటింగ్లో భాగంగానే ఇలా కనిపించిందని అందరూ అంటున్నారు. ఇకపోతే దీన్ని చూసి ప్రతి ఒక్కరు షాక్ అవ్వడమే కాకుండా..ఇది సినిమా షూటింగ్ లా లేదు నాచురల్ గా నిత్యమీనన్ అలా బయటకు వచ్చి చాపలు కొనుగోలు చేయడానికి వచ్చినట్లు ఉంది అంటూ ఆమె సాదాసీదాతనానికి ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news