నిత్యామీనన్-విజయ్ సేతుపతి మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్..

-

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ నిత్యా మీనన్ ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ‘భీమ్లా నాయక్’ సినిమాలో నటించింది. ఈ పిక్చర్ సూపర్ హిట్ అయింది. తాజాగా నిత్యామీనన్ మరో చక్కటి అవకాశం కొట్టేసింది. కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సరసన హీరోయిన్ గా నటించే చాన్స్ దక్కించుకుంది.

ఆ సినిమా టైటిల్ ను తాజా గా మేకర్స్ అనౌన్స్ చేశారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 19 (1)(a)ను ఆధారంగా ఈ ఫిల్మ్ ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ..ఈ మూవీ టైటిల్ ‘‘19 (1)(a)’’ గా పెట్టడం విశేషం.

మాలీవుడ్(మాలయాళం)లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు విజయ్ సేతుపతి ఇన్ స్టా గ్రామ్ వేదికగా ప్రకటించేశాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేశాడు. ఇందు ఎస్ఎస్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండగా ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ వారు ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రంతో ఇందు దర్శకుడిగా పరిచయం కాబోతుండగా, ‘‘96’’ ఫేమ్ గోవింద్ వసంత ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news