రీ రిలీజ్ కి సిద్ధమైన ఎన్టీఆర్ సింహాద్రి సినిమా.. ఎప్పుడంటే..?

-

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే రీ రిలీజ్ ట్రెండు కొనసాగుతోంది. పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ నేటికీ ఎంతోమంది హీరోల సినిమాలు రీ రిలీస్ అవుతూ ఒకవైపు పాపులారిటీ దక్కించుకోవడమే కాకుండా బిజినెస్ పరంగా కూడా దూసుకుపోతున్నాయి. పవన్ కళ్యాణ్ , చిరంజీవి , బాలకృష్ణ, మహేష్ బాబు ఇలా చాలామంది సినిమాలను రీ రిలీజ్ చేసి నిర్మాతలు భారీగా బిజినెస్ చేసుకుంటున్నారు.

అయితే గతంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలను ఫోర్ కే వెర్షన్లో అప్డేట్ చేస్తూ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోని ఈ పాత సినిమాలతో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాను రిలీజ్ చేసి భారీగా బిజినెస్ చేసిన నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమా ఈ ఏడాది ఎలాగో రిలీజ్ కావడం లేదు. కాబట్టి ఆయన నటించిన సింహాద్రి సినిమాను మే 20వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు. ఫోర్ కే ప్రింట్ తో థియేటర్లలో రీ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ ని అందించింది. కలెక్షన్ల పరంగా కూడా సునామీ సృష్టించింది. 2003 జూలై 9 న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో భూమిక, అంకిత హీరోయిన్లు గా నటించారు. ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి బిజినెస్ చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news