జాతీయ నేతలతో కలిసి యాదాద్రికి బయల్దేరిన కేసీఆర్

-

ఖమ్మంలో భారీ బహిరంగ సభతో ఇవాళ.. జాతీయరాజకీయాల్లో బీఆర్ఎస్ శంఖారావం పూరించనున్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఇవాళ ఆ నగరంలో జరగనున్న సభకు గులాబీదళం కనీవిని ఎరుగనిరీతిలో ఏర్పాట్లు చేసింది. ఈ సభకు జాతీయనేతలు వస్తున్న నేపథ్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది.

నిన్న సాయంత్రం రాష్ట్రానికి చేరుకున్న జాతీయ నేతలు.. ఇవాళ ఉదయం తాము బస చేసిన చోటునుంచి ప్రగతి భవన్​కు వెళ్లారు. అక్కడ కేసీఆర్​ ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ విందు అనంతరం కేసీఆర్.. జాతీయ నేతలకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. అనంతరం వారంతా కలిసి ప్రగతిభవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి జాతీయ నేతలతో కలిసి కేసీఆర్ యాదాద్రికి బయలుదేరారు.

Read more RELATED
Recommended to you

Latest news